న్యూ ఢిల్లీ: స్వామి చిన్మయానంద అత్యాచారం కేసులో బాధితురాలిని అరెస్టు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ నిప్పులు చెరిగారు. నిందితుడికి రక్షణ కల్పించి, బాధితురాలిని నిందితురాలిగా మార్చ డాన్ని దుయ్య బట్టారు. ‘అత్యాచార కేసులో నిందితుడు చిన్మయానందకు రక్షణ కల్పించారు. బాధితురాలిని నిందితురాలిగా చేశారు. చిన్మయా నంద ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన పై ఫిర్యాదు చేసిన బాధితురాలికి బెయిల్ నిరాకరించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు’ అని సిబల్ ట్వీట్ ప్రభుత్వాన్ని ఎండ గట్టా రు.