లడఖ్ : గాల్వన్ లోయ వద్ద గత రాత్రి భారత్ – చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టు కున్నారని భారత పదాతి దళం మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఇందులో ఒక సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్, ముగ్గురు సైనికుల్ని చైనా కోల్పోయిందని వివరించారు. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని ఆరోపించారు.