చిదంబరానికి ఊరట

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరానికి ఊరట లభించింది. ఆయన సీబీఐ కస్టడీని ఈ నెల అయిదో తేది వరకు సుప్రీం కోర్టు పొడిగించింది. ఆయన తదుపరి కస్టడీ తమకు అవసరం లేదని, జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం తీహార్ జైలుకు తరలించాలన్న సీబీఐ వాదనను సర్వోన్నత న్యాయ స్థానం తోసిపుచ్చింది. ఆయనను ఇప్పుడే తీహార్ జైలుకు తరలించరాదని స్పష్టం చేసింది. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అప్పీలుపై ఈ నెల 5న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos