ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం

ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ ధ్వంసం

న్యూఢిల్లీ: ‘దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆర్థిక స్థితి బాగుందని చెబుతున్నార’ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే నాశనం చేసే సింది. ఈ సమస్యపై కేంద్ర మంత్రుల వద్ద ఎటువంటి పరిష్కార మార్గాలు లేవ’ని వ్యాఖ్యానించారు. ‘నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉందని అన్నారు. అచ్చేదిన్ త్వరలోనే వస్తుందన్న వ్యాఖ్య ను మాత్రమే ఆమె చేయలేదు. మిగతా అన్ని విషయాలను చెప్పారు’ అని ఎగతాళి చేసారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతున్నప్పటికీ భాజపా నేతలు అంతా బాగానే ఉందని చెబుతున్నారని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos