ఇప్పటివరకు తెరపై
అందాలు ధారబోసిన దీపికా పదుకునేను చూసిన ప్రేక్షకులు,అభిమానులు తదుపరి చిత్రంలో దీపికా
నటనను చూడడానికి సిద్ధంగా ఉండాలి.ఎందుకంటే దీపిక తన తదుపరి చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలైన
లక్ష్మీ అగర్వాల్ పాత్రను తెరపై పోషించనున్నారు.2005వ సంవత్సరంలో ఢిల్లీలో లక్ష్మీ
అగర్వాల్పై తన ప్రేమను నిరాకరించిందనే కక్ష్యతో సైకో ప్రేమికుడు యాసిడ్ దాడి చేసిన
విషయం తెలిసిందే.అనంతరం దాడి తాలూకా గాయాల నుంచి కోలుకొని జీవితంలో లక్ష్మీ అగర్వాల్
ఎలా గెలిచిందనే విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేఘన గుల్జార్ ఛపాక్
పేరుతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.ఈ క్రమంలో సోమవారం నుంచి ఛపాక్ షూటింగ్ ప్రారంభం
కావడంతో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో నటించనున్న దీపిక పదుకునే ఫస్ట్లుక్ను సోమవారం
చిత్ర బృందం విడుదల చేశారు.ఛపాక్ గురించి దీపిక వివరిస్తూ..గాయపడి,గెలిచిన వ్యక్తి
కథ,మనిషి బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసే కథ..ఇలాంటి కథ చేస్తున్నందుకు గర్వంగా ఉందని
పేర్కొంది..ఈ చిత్రంలో దీపిక మాల్తి అనే పాత్రలో కనిపించనున్నారు..