నగలు దోచి నటితో పరార్‌..

  • In Crime
  • October 6, 2019
  • 152 Views
నగలు దోచి నటితో పరార్‌..

ఈనెల 2వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో లలిత జ్యువెల్లరీ నగల దుకాణంలో జరిగిన భారీ చోరీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.చోరీకి సంబంధించి తిరువారూరుకు చెందిన మణికంఠన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నాలుగు కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకొని విచారణ చేయగా నిందితుడు పలు విషయాలు వెల్లడించాడు.చోరీలో ప్రధాన నిందితుడైన తిరవారూరుకు చెందిన మరుగన్ చోరీ చేసిన నగల్లో రూ.10 కోట్ల విలువ చేసే బంగారు నగలతో పాటు ఓ నటితో శ్రీలంకకు పరారైనట్లు విచారణలో వెల్లడించాడు. దొంగల ముఠా నేత మురుగన్.. సురేశ్ అనే వ్యక్తితో పాటు పేరు మోసిన దొంగైన అతడి మామతో కలిసి ఈ నగల దుకాణం చోరీకి స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో మణికంఠన్‌ అంగీకరించాడు. ఆ ఇద్దరితో జత కట్టిన మురుగన్ 13 కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. చెన్నై ఈసీఆర్లో లగ్జరీ బంగళా, ఇతర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మురుగన్ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, నగల దుకాణాలు, ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం.ప్రధాన నిందితుడైన మురుగన్కు హెచ్ఐవీ వ్యాధి ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తాజా సమాచారం