చెక్ డ్యాముల నిర్మాణానికి లావణ్య హేమనాథ్ భూమి పూజ

చెక్ డ్యాముల నిర్మాణానికి లావణ్య హేమనాథ్ భూమి పూజ

హోసూరు : కృష్ణగిరి జిల్లా కొమ్మేపల్లి పంచాయతీలో రెండు చెక్ డ్యాముల నిర్మాణానికి సూలగిరి యూనియన్ చైర్‌పర్సన్‌ లావణ్య హేమనాథ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. బుధవారం ఆమె యూనియన్ పరిధిలోని పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అందులో భాగంగా సూలగిరి యూనియన్ కొమ్మేపల్లి పంచాయతీలో రూ.10.78 లక్షల ఖర్చుతో రెండు చెక్ డ్యాముల నిర్మాణానికి, కుంటలలో పూడిక తొలగింపు పనులకు లావణ్య హేమనాథ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం సూలగిరి యూనియన్‌లోని కొనేరిపల్లి గ్రామంలో 150 పేద కుటుంబాలకు
ఆమె నిత్యావసరవస్తువులను అందజేశారు. పలు గ్రామాలలో పర్యటన సందర్భంగా ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట సూలగిరి బీడీవో విమల్, పలువురు పంచాయతీ అధ్యక్షులు, కౌన్సిలర్లు,  ఎడిఎంకె పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos