తెలంగాణ సీఎంపై చంద్రబాబు ఫైర్

తెలంగాణ సీఎంపై చంద్రబాబు ఫైర్

ఏపీ సీఎం ఎలక్షన్లే లక్ష్యంగా తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుని తమను ఇరుకునపెట్టే ప్రమాదముందన్న ఆందోళనలో కనిపిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కేసిఆర్ బ్లాక్ మెయిలింగ్..తిట్టడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నారని.. ఆయన విర్రవీగుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ ఎన్నికల సంద ర్భం గా కేసీఆర్ తనను తిట్టినా – తను మర్యాదగానే ప్రచారం నిర్వహించానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో పోటీకి వస్తానంటున్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే తెదేపాని – ఇతర పార్టీలతో బేరీజు వేసుకుని ప్రజలు గమనిస్తున్నారు. జగన్ – పవన్ – ఎంఐఎంలతో కలసి కేసీఆర్ చేస్తున్న కుమ్మక్కు రాజకీయాల్ని ప్రజలు హర్షించరన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నెలకొల్పి దేశాన్ని మారుస్తానని – తనే మేధావినని కేసీఆర్ విర్రవీగుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. బ్లాక్ మెయిలింగ్ – తిట్టడమే ధ్యేయంగా కేసీఆర్ రాజకీయాలు చేయడం సబబు కాదన్నారు.మరోవైపు చంద్రబాబుకు మరింత పుట్టించేలా కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ – మిత్రపక్షం ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా తరచూ చంద్రబాబును భయపెట్టేలా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామంటున్నారు. నిజానికి వారు ఏపీకి వచ్చి ఏం చేస్తారో ఏమో కానీ వారి మాటలు వినగానే చంద్రబాబు మాత్రం కంగారుపడుతున్నారు. నిజానికి జాతీయ రాజకీయాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేసీఆర్ లోక్ సభ సీట్ల కోసం తెలంగాణలోనే భారీ ఎత్తున ప్రచారం చేసే అవకాశాలుంటాయి.. ఆ సమయంలో ఆయన అనవసరంగా ఏపీపై ఫోకస్ చేసి తెలంగాణను ఇగ్నోర్ చేసే అవకాశం ఉండదు. కేవలం చంద్రబాబును ఉలికించేందుకే కేసీఆర్ అండ్ కో ఇలా రెచ్చగొడుతున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ… చంద్రబాబు మాత్రం ఎందుకో కేసీఆర్ ఏపీలోకి వచ్చి ప్రచారం చేస్తారని టెన్షన్ పడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos