గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఘోరాలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘దిశ‘ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది.బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచిస్తూ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులోని 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా లేవని, వాటిని సరిచేసి మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది. దీంతో, సాంకేతిక అంశాలను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.మరోవైపు, ఈ నెల 7న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు.దిశ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే ఇదే చట్టాన్ని తమ రాష్ట్రాల్లో సైతం తీసుకురావడానికి మహారాష్ట్ర,ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి..