న్యూ ఢిల్లీ: హిమాచల్ప్రదేశ్ శాసనసభల ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు వుంటుందని ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాము. 80 ఏళ్లు నిండిన వాళ్లు ఇంటి నుంచే ఓట్లు వేసే అవకాశం కల్పిస్తామ’ ని విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.