న్యూ ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, బల్వీందర్ సంధు నియమితులయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ కారణంగా ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ అయ్యాయి.