న్యూ ఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్ అధికారులకు సోమవారం కేంద్రం ఉద్వాసన పలికింది. వేసింది. తక్షణమే స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్/ఏవో ర్యాంక్కి చెందిన అధికారులు. 56(జే) నిబంధన ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. సోమవారం వేటు పడిన వారిలో సీజీఎస్టీ నాగ్పూర్, భోపాల్, చెన్నై, బెంగళూరు, దిల్లీ, జైపూర్, కోల్కతా, మేరఠ్, చండీగఢ్ జోన్ల సీనియర్ అధికార్లు, బెంగళూరు, ముంబయి జోన్లకు కస్టమ్స్ అధికారులు ఉన్నారు.