సీబీఐకి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి

ఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని సర్వోన్నత న్యాయ స్థానం పేర్కొంది. అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు చేయకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమపై అవినీతి ఆరోపణల కేసులు దర్యాప్తు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిందితులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్ల ధర్మాసనం.. దిల్లీ ప్రత్యేక పోలీసు ఏర్పాటు చట్టం (డీఎస్పీఈ)లోని సెక్షన్ 5, 6ను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్, బంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్గడ్ వండి రాష్ట్రాలు సీబీఐ తమ రాష్ట్రంలోకి రాకుండా తీర్మానాలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos