విచారణకు హాజరు కావాల్సిందే..

విచారణకు హాజరు కావాల్సిందే..

అక్రమాస్తుల కేసుకు సంబంధించి కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరవడానికి మినహాయింపు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది.కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించింది.ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తాను కోర్టుకు హాజరయ్యేందుకు వస్తే సెక్యూరిటీ, ప్రొటోకాల్ ఒక్క రోజుకు ఏకంగా రూ.60 లక్షలు ఖర్చవుతుందని తనకు బదులుగా తన న్యాయవాది కోర్టుకు హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.కోర్టుకు వ్యక్తగతంగా హాజరయ్యేందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని దీంతోపాటు ఒక్కరోజుకు రూ.60లక్షలు ఖర్చు అంటే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని పిటిషన్‌లో పేర్కొన్నారు.జగన్ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్‌పై ఉన్నవి మామూలు అభియోగాలు కాదని, తీవ్ర అభియోగాలని పేర్కొంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు సీఎం హోదాలో ఆ అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని వాదించింది. కాబట్టి వ్యక్తిగత హాజరుపై మినహాయింపు ఇవ్వొద్దని అభ్యర్థించింది. రెండు వారాల క్రితమే ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును నేటికి వాయిదా వేసిన కోర్టు సీబీఐ వాదనతో ఏకీభవించి జగన్‌కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos