సినిమాను పది నిమిషాలు ఆలస్యంగా ప్రదర్శించినందుకు ఓ ప్రేక్షకుడు సినిమా థియేటర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీలో ఉన్న మంజీరా సినీ పోలిస్ థియేటర్లో గోపీచంద్ నటించిన చాణక్య చిత్రం 04.40 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా థియేటర్ యాజమాన్యం పది నిమిషాలు ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించింది. పది నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడంతో చిరాకుతో ఒక ప్రేక్షకుడు కేసు వేశాడు. ఈ నెల 8న పోలీసులకు ఈ విషయంపై పిర్యాదు అందింది. ప్రేక్షకుల సమయాన్ని అనవసరంగా వృధా చేశారని నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపించాడు.అందుకు సంబంధించి కోర్టు నుంచి అనుమతి రావడంతో కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు.