న్యూ ఢిల్లీ : భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది దీని బారిన పడ్డారు. 15 మంది మరణిం చారు. మంగళవారం 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.