కొత్తగా 328 మందికి పాజిటివ్‌

న్యూ ఢిల్లీ: దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 328 జేఎన్.1 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూశాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరువైంది గత 24 గంటల వ్యవధిలో ఒకరు కేరళలో మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.మొత్తం 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్తోపాటు పుదుచ్చేరిలో యాక్టివ్ కేసులు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos