మళ్లీ పెరిగిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్ కేసుల పెరుగుదల నాలుగో వేవ్ మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. రోజు వారీ పాజిటివ్ కేసులు క్రమ క్రమంగా అధికమ వుతు న్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరు వయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52 శాతం. ఇప్పటి వరకు 4,29,21,977 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జీ అయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos