న్యూ ఢిల్లీ: ఇక్కడి విమానాశ్రయం టీ2 టెర్మినల్లోని 201వ స్టాండ్లో మంగళవారం గోఫస్ట్ ఎయిర్లైన్కు చెందిన కారు ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది. విమానం ముందు చక్రాల ముందు ఆగింది. త్రుటిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది.విమానం మంగళవారం ఉదయం దిల్లీ నుంచి పట్నాకు బయల్దేరాల్సి ఉంది. ఈ దశలో కారు దూసుకొచ్చిందని అధికార్లు తెలిపారు. ఎవరూ గాయపడలేదని, విమానానినీ నష్టం జరగలేదని అధికార్లు తెలిపారు. కారు వెనక్కి వచ్చిన తర్వాత విమానం షెడ్యూల్ ప్రకారమే బయల్దేరిందని వెల్లడించారు.