ఇది పేదల నోరు కొట్టిన బడ్జెట్‌

ఇది పేదల నోరు కొట్టిన బడ్జెట్‌

న్యూ ఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల వర్షాన్ని కురిపించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతోమాట్లాడారు. ‘ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తమకు మద్దతు లభిస్తుందని 99శాతం మంది ప్రజలు ఆశిస్తే.. కేవలం ఒక శాతం సంపన్నులకు మేలు చేసేలా బడ్జెట్ను రూపొందించారు. పేదలు, శ్రామికులు, రైతులు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సంపదను తీసుకెళ్లి 5 నుంచి 10 మంది ధనికుల జేబుల్లో కేంద్రం పెడుతోంది. పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రవేటీకరణ గురించే కేంద్రం మాట్లాడుతోంది. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవాలంటే ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. వినియోగం ద్వారానే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుంది. సరఫరా ద్వారా కాద’న్నారు. దిల్లీ సరిహద్దులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు. ఢిల్లీని గడీ లా ఎందుకు మార్చారని నిలదీశారు. సాగు చట్టాలను రెండేళ్లపాటు నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ప్రకటించడం వెనుక అర్థమేంటన్నారు. సాగు చట్టాల సమస్యను పరిష్కరించే ఉద్దేశం కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos