వాషింగ్టన్:ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి దర్యాఫ్తునకు కెనడాకు భారత్ సహకరించాలని అగ్రరాజ్యం అమెరికా సూచించింది. విచారణకు సహకరించాలని తాము భారత్ను ప్రయివేటుగా, బహిరంగంగా అభ్యర్థించామని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరగాలని, అలాగే దోషులకు శిక్ష పడాలన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు తమకు తీవ్ర ఆందోళన కలిగించిందని, కెనడా భాగస్వాములతో తాము సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దోషులకు శిక్షపడే దిశగా కెనడా దర్యాఫ్తు కొనసాగాలని ఆకాంక్షించారు. విచారణకు భారత్ కూడా సహకరించాలని అభ్యర్థించామన్నారు.