అమిత్‌ షా ఆప్తులకే మంత్రి పదవి

అమిత్‌ షా ఆప్తులకే మంత్రి పదవి

బెంగళూరు: కర్నాటక మంత్రి వర్గ సభ్యుల ఎంపికలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాదే తుది నిర్ణయం. ఈ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి యడ్యూరప్పే సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి యడ్యూరప్పఎంపిక చేసిన వారికే పదవి లభిస్తుందనే వాతావరణం ఉండేది. పరిస్థితిలో మార్పు సంభవించటంతో యడ్యూరప్ప అనూయాయుల్లో పదవి లభిస్తుందో లేదోననే భీతి ఆవహించింది. ‘‘మరికొన్ని గంటల్లో అమిత్ షా నుంచి మంత్రుల తుది జాబితా అందుతుంది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఉంటుంది. దీన్ని ఇప్పటికే గవర్నర్ వాజుబాయివాలాకు తెలిపాను. సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను’ అని యడియూరప్ప వివరించారు. 13,14 మంది మంత్రులుగా మంగళ వారం ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలిపారు.మూడు వారాల కిందట ముఖ్యమంత్రిగా ప్రమాణాన్ని చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos