న్యూఢిల్లీ: భాజపా మహిళ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్లు రాజకీయాల నుంచి వైదొలగనున్నారు. తమకు పార్లమెంట్ మాజీ సభ్యుల గుర్తింపు పత్రాల్ని మంజూరు చేయాలని పార్లమెంట్ కార్యాలయానికి ధరఖాస్తు చేసారు. లోక్సభ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు దూరమవటం తెలిసిందే. ఆనారోగ్యం కారణంగా సుష్మ, వయో భారంతో మహాజన్ ఎన్నికల్లో పోటీ చేయ లేదు. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగదలచినందున మహాజన్ ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులకు సుమిత్ర మహాజన్ విందును కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. తనకు లోక్సభ స్పీకర్గా అవకాశం కల్పించిందుకు ఆమె భాజపా పెద్దలకు ట్విట్టర్లో ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ బాధ్యతలు నిర్వహించిన సుష్మా స్వరాజ్ విధిశ నుంచి, మహాజన్ ఇండోర్కు లోక్సభలో ప్రాతినిథ్యం వహించారు.