బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

హొసూరు : ఇక్కడి కృష్ణగిరి జాతీయ రహదారిపై సూళగిరి సమీపంలోని చిన్నారు వద్ద శుక్రవారం ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన సంఘటనలో 15 మంది గాయపడ్డారు. యూ టర్న్‌ వద్ద ఓ లారీ మలుపు తిరుగుతుండగా, అదే సమయంలో బస్సు అక్కడికి వచ్చింది. డ్రైవర్‌ దానిని తప్పించే ప్రయత్నంలో లారీని తాకుకుంటూ బస్సు సర్వీసు రోడ్డుపైకి వెళ్లింది. అక్కడ సుధ అనే మహిళ బస్సు కోసం వేచి ఉంది. డ్రైవర్‌ ఆమెను చూసి హఠాత్తుగా బ్రేక్‌ వేయడంతో బస్సు బోల్తా పడింది. గాయపడిన సుధను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు యజమానురాలు, డ్రైవర్‌ అబిరామి, కండక్టర్‌ రాజ్‌ కుమార్‌ కూడా గాయపడ్డారు. సూళగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రమాదాల నెలవు…యూ టర్న్‌

చిన్నారు వద్ద యూ టర్న్‌ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకునే గతంలో మూసివేశారని, ఇటీవల మళ్లీ తెరిచారని చెప్పారు.

తాజా సమాచారం