పలమనేరు: గంగవరం మండలం మామడుగు సమీపంలో శనివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు సజీవ దహనమయ్యారు. వారు..తిరుపతికి చెందిన పావనరారు, కళావతి, జాహ్నవి, భానుతేజ, సాయి అశ్రిత. తీవ్రంగా గాయ పడిన విష్ణును చికిత్స కోసం పలమ నేరు ఆస్ప త్రికి తరలించారు. . బెంగళూరు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. తక్షణమే కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు అయిదుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు.