టీ20 రికార్డుకు చేరువలో బుమ్రా

టీ20 రికార్డుకు చేరువలో బుమ్రా

బెంగళూరు: పేస్‌ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే చాలు టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కీర్తి గడిస్తాడు. ఇప్పటి దాకా రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఈ రికార్డు ఉంది. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో బుమ్రా 16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో అతడి ఖాతాలో వికెట్ల సంఖ్య 51కు చేరింది. అశ్విన్ 52 వికెట్లతో ముందున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆసీస్తో కోహ్లీ సేన బుధవారం రెండో టీ20లో తలపడనుంది. పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 98 వికెట్లతో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos