లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబై : బుధవారం నష్టాల్ని చవి చూసిన స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ లాభాల పట్టాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు మెరుగుపడి 38,545 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 11,570 వద్ద ముగిశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లాభాల్ని గడించాయి. ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో కంపెనీ షేర్లు నష్టాల పాలయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.99 వద్ద ట్రేడయ్యింది. దాదాపు అన్నిరంగాలూ లాభపడ్డాయి. స్తిరాస్తి, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు 2-1.25 శాతం పెరిగాయి. కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు బాగా లాభ పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos