దున్నపోతని ఓడించారు

దున్నపోతని ఓడించారు

అమరావతి: ‘పాలిచ్చే ఆవు అని భావించి 2014లో ప్రజలు చంద్ర బాబుకు పట్టం కట్టారు.వాస్తవానికి బాబు తన్నే దున్నపోతని తెలియడంతో ఓడించార’ని వైకాపా అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య గురువారం ఇక్కడ ఒక పత్రికా ప్రకటనలో వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఓటమికి ప్రజల్నే బాధ్యుల్ని చేసిన ఏకైక నేత చంద్రబాబేనని ఎద్దేవా చేసారు. ‘పదే పదే ప్రజల విజ్ఞతను ప్రశ్నించడం.ఎన్నో చేస్తే 23 సీట్లే ఇచ్చారు’ వంటి వ్యాఖ్యలు చేసి ప్రజా తీర్పును కించపరిచారని మండి పడ్డారు. తెదేపాకు భవిష్యత్తు లేదనే నిర్థారణకు వచ్చి అనేక మంది నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు. ప్రజలకు చంద్రబాబు ఐదేళ్ల పాలన ఎన్నో చేదు అనుభవాల్ని మిగిల్చిందన్నారు. బాబు ఎన్ని విన్యాసాలు చేసినా ఆ పార్టీ ఇక కోలుకోబోదని నమ్మకంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో పర్యటిస్తుండగా చంద్రబాబు మతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ తన పై మోదీకి ఫిర్యాదు చేశారని బాబు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. ‘అసలు చంద్రబాబు నాయుడు దేనికి భయపడుతున్నారు. ఆయన మానసిక స్థితి సరిగా ఉందా’ని అనుమానించారు. అంటే తాను తప్పులు చేసినట్లు చంద్రబాబు ఒప్పుకొన్నట్లేనా’ని ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబుతన మానసిక స్థితిని పరీక్ష చేయించుకోవడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos