పవిత్ర స్నానికి వచ్చి…. పరలోకానికి

పవిత్ర స్నానికి వచ్చి…. పరలోకానికి

లక్నో: బులంద్షహర్లో పాదచారుల బాటపై నిద్రించిన ఏడుగురిపై శుక్రవారం తెల్లవారు జామున బస్సు దూసుకు పోవటంతో వారంతా అక్కడి కక్కడే మృత్యువాత పడ్డారు. ఉత్తర ప్రదేశ్ హత్రాస్కు చెందిన కొందరు గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు ఇక్కడి నరోరా ఘాట్కు వచ్చారు. గురు వారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్నపాదచారుల బాటపైనే నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున వైష్ణోదేవి ఆలయం నుంచి వచ్చిన ఒక బస్సు వారిపై దూసుకు పోయింది. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం పోలీసులు కేసు నమోదు చేశారు. శవాల్నిపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పారిపోయాడని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos