వెంకన్నకు బెదిరింపులు

వెంకన్నకు బెదిరింపులు

అమరావతి :తెదేపా నుంచి భాజపాలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యులు హిందీ భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తున్నారని తెదేపా శాసన మండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. ‘…ఫోన్ చేసి కేసులు పెడతాం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. కేసులు పెట్టి బోల్టులు బిగిస్తారు జాగ్రత్త అని బెదిరించారు. ఫిరాయింపులు జరిగిన గంటలోపే బెదిరింపులు మొదలయ్యాయి. మా అధ్యక్షుడైన చంద్రబాబు కోసం ప్రాణాలు ఇస్తాను. జైలుకు సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాన. నా పై కేసులు పెట్టడానికి నేనేమైనా బ్యాంక్ దోపిడీలు, వంచనలు చేశానా’ అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజా సేవకే అంకితమయ్యానని చెప్పారు. ఈ బెదిరింపుల గురించి శనివారం పోలీసు డైరెక్టర్‌ జనరల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెదేపాలోనే కొనసాగుతానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos