ముంబై : ప్రపంచ కప్పులో ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో తర్వాత నిర్ణయిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, ఆ విషయమై కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నాడు. అతనితో పాటు దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్లు కూడా ఉన్నారని చెబుతూ, ఎవరెప్పుడు ఏ ఆర్డర్లో ఆడాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. బాగా చర్చించిన తర్వాతనే విజయ్ను ఎంపిక చేశారని, అతనిలో ఆల్ రౌండ్ ప్రతిభ ఉందని తెలిపాడు. టూ డౌన్లో ఎవరు బ్యాటింగ్కు వస్తారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ స్థానంలో విజయ్ ఆడవచ్చని సమ్మతిస్తూనే, ప్రపంచ కప్పులో సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కోహ్లీ వ్యాఖ్యానించాడు.