చరణ్,తారక్ వంటి క్రేజీ మాస్హీరోలతో అత్యంత భారీ వ్యయంతో జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.అన్నిటికంటే ముఖ్యంగా ఈ చిత్రంలో కొమురం భిం పాత్రలో నటిస్తున్న తారక్కు జోడీని వెతకడం జక్కన్నకు తలకు మించిన భారమైంది.చిత్రీకరణ మొదలుపెట్టే సమయంలో తారక్కు జోడీగా డైసీ ఎడ్గర్ పేరు ప్రకటించినా వ్యక్తిగత కారణాలు చెప్పి డైసీ ఈ ప్రాజెక్టుకు హ్యాండ్ ఇచ్చేసింది. అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఇన్నాళ్లూ ఎవరూ సెట్ కాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు..మరో బ్రిటన్ నటిని ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్ చేసారు. పేరు ఇంకా బయిటకు రాలేదు కానీ రీసెంట్ గానే ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ఆమె అని, ఇప్పుడు ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది అని తెలుస్తోంది.అక్టోబర్ నుంచి ఆమె షూట్ లో పాల్గొననుంది. రాజమౌళి తన టీమ్ కు కూడా ఈ విషయాన్ని లీక్ చెయ్యొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.