చిన్నారి కష్టానికి జగన్‌ స్పందన

అమరావతి: సామాజిక బహిష్కరణకు గురయిన కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అండగా నిలిచారు. ప్రకాశం జిల్లా రామచంద్రా పురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు నుంచి వెలివేసారాని కోడూరి పుష్ప అనే నాలుగో తరగతి బాలిక ఏకంగా జగన్కు లేఖ రాసారు. తనతో బడిలో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారని ఆక్రోశిం చింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ను జగన్ చరవాణిలో ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos