లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా మరికొద్ది
రోజుల్లోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారాలతో హోరెత్తిస్తోంది.సాక్షి
మినహా తెలుగులో ఏ పత్రిక చూసినా,ఏ వెబ్సైట్ చూసినా,ఏ ఛానల్ చూసినా తెలుగుదేశం పార్టీ
ప్రకటనలే దర్శనమిస్తున్నాయి.ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రకటనల్లో కూడా సెంటిమెంట్ రక్తికట్టించే
విధంగా స్క్రిప్టుతో మంచి నటీనటులతో పనితనమైన కెమెరా వర్క్తో తెదేపా రూపొందించిన ప్రకటనలు
చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి.వినయ విధేయ రామ వంటి పరమ డిజాస్టర్ను వదిలిన దర్శకుడు
బోయపాటి శ్రీను తెదేపాకు ఆస్థాన దర్శకుడిగా ఉంటూ ఈ ప్రకటనలను రూపొందించినట్లు సమాచారం.ఇప్పటి
వరకు వచ్చిన ప్రకటనలు చాలా వరకు ప్రజలను ఆకర్షించాయనడంలో అతిశయోక్తి కాదేమో.కాగా ఇప్పటి
వరకు వచ్చిన ప్రకటనలు ఒక ఎత్తు అయితే త్వరలో వదలనున్న కొత్త ప్రకటన మరొక ఎత్తని తెదేపా
శ్రేణులు తెలుపుతున్నాయి..ఏపీకి ప్రధాని చేసిన మోసం ఏపీ ప్రజలను కేంద్రం మోసగించిన తీరుతో రెండు నిమిషాల నిడివి కలిగిన యాడ్ ను రూపొందించారట. అందులో మోడీ ఎన్నికల ప్రచారంలో మాటలు ఆ తర్వాత మాటలు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో మట్టి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్న క్లిప్స్ ఇలా ఏపీకి మోడీ చేసిన అన్యాయం కేంద్రంపై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలతో బోయపాటి ఒక మంచి యాడ్ ను తయారు చేశాడట. ఆ యాడ్ చూస్తే ప్రతి ఏపీ పౌరుడు కూడా పిడికిలి బిగించి తెలుగు దేశం పార్టీకి ఓటు వేసేలా ఆ యాడ్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా ఆ ప్రకటనలు వేయనున్నారట. మొత్తానికి సినిమాల విషయం పక్కన పెడితే బోయపాటి పొలిటికల్ యాడ్స్ తో దుమ్ము రేపుతున్నాడు. ఈ ఎన్నికల హడావుడి అయిన తర్వాత బాలయ్య బాబుతో బోయపాటి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.