విపక్షాలవి నీచ రాజకీయాలు

విపక్షాలవి నీచ రాజకీయాలు

విశాఖపట్నం : కరోనా బాధితుల్ని ఆదు కోవటానికి బదులుగా తితిదే నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.సోమవారం ఇక్డ విలేఖరులతో మాట్లాడారు. ‘పేదలకు రూ.1000 వంతున సాయం చేస్తే. దానిపై కూడా సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే బియ్యం. , కందిపప్పు అందించాం. అన్ని శాఖల సమన్వయంతో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాము. అన్ని రంగాలవారికి ప్రభుత్వం అండగా ఉంటుంద’న్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. పేదలకు రూ.1000 ఆర్థిక సాయం చేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రకటించడానికి ముందే పేదలకు రూ.1000 సాయం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos