పవన్‌ నోట బాబు మాట

పవన్‌ నోట బాబు మాట

అమరావతి:తెదేపా నేత చంద్ర బాబు నాయుడుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఇక్కడ ఒక దృశ్యమాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. తెదేపా వాణి పవన్ కళ్యాణ్ నోట వినిపిస్తుండటమే దీనికి సాక్షమన్నారు. అమరావతి విషయంలో తెదేపా చెప్పిన మాటల్నే చిలుకు పలుకు ల్లా పవన్ కళ్యాణ్ వినిపిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాలకు ఇతర ప్రాంతాల కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు.రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని తప్పుబట్టారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ది చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాల సమన్వయంతో పాలన సాగిస్తున్నామని బొత్స చెప్పారు.‘దొనకొండా.. అదెక్కడుంది’ అని బొత్స సత్యనారాయణ విలేఖరులను ప్రతినిధులను ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos