ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

చెన్నై: తాంబరంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో ఈ తరహా దాడులు జరగడం ఇది మూడోసారి. తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని తాను అనుకున్నప్పటికీ అది కాదని తేలిందని చెప్పారు. వెంటనే మంటలు ఆర్పివేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. నిందితుడు ఫుటేజ్ లభించినట్టు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos