ప్ర‌ఖ్యాత హోట‌ళ్ల‌కు బాంబు బెదిరింపు

ప్ర‌ఖ్యాత హోట‌ళ్ల‌కు బాంబు బెదిరింపు

బెంగుళూరు: బెంగుళూరులో ఉన్న మూడు పెద్ద హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆగ్నేయ విభాగం బెంగుళూరు డీసీపీ తెలిపారు. డిల్లీలో కూడా నిన్న బాంబు బెదిరింపులు వచ్చాయి. నార్త్ బ్లాక్ ప్రాంతంలో ఆ కాల్స్ వచ్చినట్లు తేలింది. హోంమంత్రి ఆఫీసు ఉండే ఆ ప్రాంతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ఆ బెదిరింపులు ఉత్తవే అని అధికారులు గుర్తించారు. మే 14వ తేదీన బెంగుళూరులోని 8 స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాల్స్ను కూడా ఉత్తవే అని అధికారులు తేల్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos