ఫౌజీ భాయ్ ఖతం. బాంబులు మాయం

ఫౌజీ భాయ్ ఖతం. బాంబులు మాయం

శ్రీ నగర్:పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో బాంబుల తయారీ నిపుణుడు ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నాడని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇది భద్రతా బలగాలకు పెద్ద విజయమని అభివర్ణించారు. రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒక దాన్ని భద్రతా బలగాలు పేల్చి వేసారు. మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో వాటి కోసం ముమ్మర తనిఖీలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos