హొసూరు : మే డేను పురస్కరించుకుని పెద్ద ఎత్తున పట్టణంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఉద్ధిరం నిర్వాహకులు ఏటా మే డే ను పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు రక్తదాన శిబిరాన్ని మూడు చోట్ల నిర్వహించారు. శిబిరంలో హొసూరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమారు 500 మందికి పైగా రక్త దానం చేశారు. రక్త దాతలకు పళ్ళు, బిస్కెట్లు తదితర తినుబండారాలను పంచిపెట్టారు.