చండీగఢ్: పంజాబ్లోని లుధియానాలో ఉన్న జిల్లా కోర్టు క్లాంప్లెక్స్లో సంభవించిన బాంబు పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్లోని రెండో అంతస్తు బాత్ రూం నుంచి ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు బాత్ రూం గోడలు ధ్వంసమై సమీపంలోని కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఫైరింజన్ సిబ్బంది సహా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఆందోళన వ్యక్తం చేశాను. తాను వెంటనే లుధియానా వెళ్తున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది దేశ వ్యతిరేక శక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.