కాబూల్ : కందహార్ ప్రావిన్సు, పంజావాయి జిల్లాలో గురు వారం ఉదయం మందు పాతర పేలటంతో నలుగురు పౌరులు మరణించారు. మరో ఆరు గురు గాయ పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు, గాయపడిన వారిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా ప్రకటించ లేదు. ఈ నెల 9వతేదీన అర్గిస్థాన్ జిల్లాలో జరిగిన మరో పేలుడులో 8 మంది పౌరులు మరణించారు.