దంతెవాడ దాడులకు ప్రతీకారం

దంతెవాడ దాడులకు ప్రతీకారం

భుబనేశ్వర్: ఒడిశా, మల్కన్ గిరి జిల్లా తిమురుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మావోయిస్టులు శుక్రవారం రాత్రి డిటోనేటర్లతో పేల్చి వేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసనగానే ఈ భవనాన్ని పేల్చివేసినట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) పేరిట కర పత్రాలను అంటించారు. దాదాపు నలభై మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు  స్థానికులు తెలిపారు. పంచా యతీ కార్యాలయ భవనాన్ని పేల్చి వేసిన అనంతరం మావో యిస్టుల అడవుల్లోకి పోయారు. నష్టం అంచనాల్ని ఇంకా లెక్కగట్టాల్సి ఉందని పంచా యతి అధికార్లు తెలిపారు. పోలీసులు, కేంద్ర బలగాలు వారి కోసం గాలింపుల్ని చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos