ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ , జనసేన మధ్య సీట్ల లెక్క తేలింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ 50 నిమిషాల పాటు జరిపిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. బీజేపీ, జనసేనలకు 30 శాసనసభ, ఎనిమిది లోక్ స్థానాలు ఇచ్చేందుకు తెదేపా అంగీకరించింది. 8 సీట్లలో బీజేపీ ఆరు చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ గురించి బీజేపీ అంతగా పట్టించుకోవడం లేదు. లోక్ సభ సీట్లపై మాత్రం దృష్టిసారించింది.