హైదరాబాద్ : వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరనున్నందున ఈ నెల 18న నగరంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. తెదేపా, తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరనున్నారని, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశామని శుక్రవారం ఆయనిక్కడ వివరించారు. భాజపా కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ. నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనికి తమకు మద్దతునిచ్చే నాయకులను స్వాగతిస్తామని తెలిపారు.