హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్

హిందూమతం గురించి మాట్లాడితే ఖబడ్దార్

హిందూమతాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారుహిందూమతం, ధర్మం గురించి పవన్‌ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఇతర మతానికి మారిపోయినట్టు అనిపిస్తోందని అన్నారు. లౌకికతత్వంపై కనీస అవగాహన లేని పవన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోకుంటే, ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఖబడ్దార్ పవన్‌’ అంటూ కటువు వ్యాఖ్యలు చేశారు.నిన్న పవన్ తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, హిందూ రాజకీయ నేతలే మత రాజకీయాలు ఆడుతున్నారని, మతాల గొడవలు పెడుతున్నది కూడా వారేనని వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం చేయిస్తున్నది కూడా హిందువులేనని పవన్ సంచలన విమర్శలు చేశారు. ఇతర మతాల వారెవరూ హిందూమతాన్ని కించపరచడం లేదని అన్నారు. సెక్యులరిజాన్ని ఇబ్బందులు పెడుతున్నది కూడా హిందూ నేతలేనని పవన్ అనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తాజా సమాచారం