ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌తో భాజపా భేటీ

ఆర్టీసీ సమ్మెపై గవర్నర్‌తో భాజపా భేటీ

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు గురువారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ, రవాణా శాఖ మంత్రి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపకుండా, సీఎం స్పందించకుండా కార్మికులు సమ్మెకు దిగిన వెంటనే వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ప్రకటించడం దారుణమన్నారు. తెలంగాణ ఆస్తులను దోచుకునేందుకు ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టి, తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీని కట్టబెట్టడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం, 50వేల మంది కార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ప్రభుత్వం కొన్ని పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల బాటలో ఉంటుందని తెలంగాణ ఉద్యమం సందర్భంగా డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos