కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ పై అవినీతి కేసు

కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ పై అవినీతి కేసు

తిరువనంతపురం : శాసనసభ ఎన్నికల్లో పోటీకి టికెట్ వితరణకు జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ (జేఆర్పీ) అధ్యక్షుడు సీకే జాను నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణపై బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్కు వ్యతిరేకంగా కేసు నమోదైంది. సంబంధిత ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. దరిమిలా వయనాడు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేంద్రన్పై కేసు నమోదు చేశారు. సురేంద్రన్పై ఇప్పటికే ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. తనను పోటీ నుంచి తప్పుకోవాలని బెదరించి, తర్వాత రూ. 2.5 లక్షలు లంచం ఇచ్చారంటూ మంజేశ్వరమ్ స్థానానికి బీఎస్పీ తరపున నామినేషన్ వేసిన కె.సుందర ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ నెల 7న సురేంద్రన్పై కేసు నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos