రామ జపం చేయనందుకు కర్కశంగా దాడి

రామ జపం చేయనందుకు కర్కశంగా దాడి

కోల్కతా : జైశ్రీరామ్ అని పలకపోవడంతో పదేళ్ల బాలుడిపై బిజెపి కార్యకర్త కర్కశంగా దాడి చేసి అతని ముఖం, తలను తీవ్రంగా గాయపరచాడు. పురూలియా నగరంలోని నదియాలో బిజెపి కార్యకర్త మహదేవ్ ప్రమాణిక్ నదియాలో ఒక టీ అంగడియజమాని. ఆయన భార్య మిథు ప్రమాణిక్ స్థానిక బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలు. టీ స్టాల్ పక్క నుంచి వెళుతున్న బాలుడిని మహాదేవ్ అడ్డుకుని జై శ్రీరామ్ అని పలకాలని బెదిరించాదు. ఇంకా ఆ బాలుడి తండ్రిని దూషించాడు. రామనామ స్మరణకు నిరా కరించిన బాలుడిని చితక్కొట్టాడని స్థానికులు పేర్కొన్నారు. ఆ బాలుడి తండ్రి అధికార టిఎంసి మద్దతుదారుడు కావడంతో ఉద్దేశపూర్వకంగానే బాలుడిపై దాడి చేసి నట్లు స్థానికులు ఆగ్రహించారు. ఎన్నికల్లో బాలుడి తండ్రి టిఎంసికి అనుకూలంగా ప్రచారం చేపట్టడం కూడా కారణమన్నారు. బాలుడిపై దాడి చేసిన మహదేవ్ ప్రమాణిక్ను ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. 12వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనను సుమోటుగా స్వీకరించి దర్యాప్తు చేపడతామని, నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos