భాజపాకు మరో పరాభవం

భాజపాకు మరో పరాభవం

ముంబై: శాసన మండలి ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆరు స్థానాల్లో ఒక్క చోటే ఆ పార్టీ గెలిచింది. అధికార శివసేన – ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి నాలుగు స్థానాల్లో విజయాన్నిసాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నెల ఒకటిన మూడు పట్టభద్ర, రెండు ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఔరంగాబాద్, పుణె పట్టభద్రుల స్థానాలను ఎన్సీపీ గెలుచుకుంది. భాజపాకు బలమున్న నాగపూర్ పట్టభద్రుల స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos